|
కొండంత రాగం తీసి ఆర్భాటంగా ప్రకటించిన మద్యం విధానం సర్కారు అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మంత్రివర్గ ఉపసంఘమంటూ కొండను తవ్వుతున్నట్లు ఫోజిచ్చిన సర్కారు పెద్దలు చివరకు సిండికేట్ల ముందు సాష్టాంగపడ్డారు. వారి ప్రయోజనాలకే పట్టం కట్టారు. ప్రజల ఆకాంక్షలను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని విస్మరించారు. అస్మదీయులకు మేలు చేయడం, ఖజానాను నింపుకోవడం అన్న రెండు అంశాల చుట్టే నూతన మద్యం విధానం...
|