| వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న విమర్శల వల్లనే ఆయనకు, ఆయన పార్టీకి సానుభూతి పెరుగుతోందని మాజీ మంత్రి, కంటోన్మెంటు ఎమ్మెల్యే శంకర రావు గురువారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితే కాస్త మెరుగ్గా ఉందన్నారు. కర్నాటక పరిస్థితి కన్నా దారుణంగా ఉందన్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్... |