|
ద్వారకానగర్లో ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంటి పై కప్పుతోపాటు సామాగ్రి కూడా ధ్వంసమైంది. ద్వారకానగర్కు చెందిన హుసమొద్దీన్ శనివారం సాయంత్రం 5 కిలోల సిలిండర్ను ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం ఉదయం భార్య కతీజాబేగం స్టవ్ వెలిగించింది. ఒక్కసారిగా సిలిండర్ నుండి మంట వ్యాపించాయి. ఈ మంటను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. భయాందోళనతో కుటుంబీకులంతా ఇంటి నుండి బయటకు...
|