| రాజమౌళి షాంఘై ప్రయాణమై వెళ్లారు. ఆయన 'ఈగ' చిత్రం ఆయన్ని మోసుకెళ్లింది. ఇటీవల కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేసిన 'ఈగ' ఇప్పుడు షాంఘై వెళ్లింది. అక్కడ జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. అందులో పాల్గొనేందుకు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా షాంఘై వెళ్లారు.'ఈగ'తో పాటు బాలీవుడ్ చిత్రాలు 'త్రీ ఇడియట్స్', 'జాలీ ఎల్.ఎల్.బి', 'మర్డర్ 3', 'బర్ఫీ', 'పుష్పక్'... |