పరుగులు రాణి పీటీ ఉషా ఆధ్వర్యంలో కోళికోడ్లో నడుస్తున్న పీటీ ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్లో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడీఏ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పాఠశాలకు చెందిన అథ్లెట్ల్ బస చేసే గదుల్లో కలియతిరుగుతూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఏవైనా ఉన్నాయా ఆరా తీస్తూ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ వి.జయరామన్, ఇద్దరు టెక్నికల్ ఆఫీసర్లు, ఇద్దరు మహిళా డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్లు...